భార్యను చనిపోమన్నాడు.. కట్నం కోసం రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (10:22 IST)
వరకట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేశాడు ఓ భర్త. అది కూడా పుట్టింటి నుంచి డబ్బు తేవాలని ఒత్తిడి చేయలేదు. భార్యను చనిపోవాలని.. ఆమె చనిపోతే మరో యువతిని పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. 
 
భార్యను చావమని వేధించి నరకం చూపించాడు. ఆమె చనిపోతే.. భారీగా కట్నం వస్తుందని భర్త చిత్రహింసలకు గురిచేశాడు. భర్త చిత్రహింసలు తాళలేక ఆ మహిళ భర్త నుంచి తప్పించుకుని స్వదేశం చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండలానికి చెందిన 32 ఏళ్ల యువతి శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్ రెడ్డితో 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన దంపతులు అమెరికాకు వెళ్లారు. వారికి ఓ బాబు కూడా వున్నాడు. 
 
కొంతకాలం అదనపు కట్నం కోసం ప్రవీణ్ రెడ్డి భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం ఇవ్వకపోవడంతో పలుమార్లు దాడి చేసి ఆమెకు భోజనం, మంచినీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించాడని పోలీసుల ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments