Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య డెలివరీకి పుట్టింటికి వెళితే మరదలితో భర్త ఎంజాయ్, చివరికి?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:31 IST)
డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. మరదలు చదువుకునేందుకు ఇంటికి వచ్చింది. లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. డెలివరీ కోసం వెళ్ళిన భార్య రావడానికి సమయం పడుతుందని మరదలికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఎంజాయ్ చేశాడు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
 
హైదరాబాద్ నగరంలోని హఫీజ్ బాబానగర్ ఆక్తర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సంతోష్, రాణిలు నివాసముండేవారు. సంవత్సరం క్రితమే వీరికి పెళ్ళయ్యింది. అన్యోన్యంగా ఉన్నారు. ఆర్థికంగా సంతోష్ బాగా ఉండడంతో లాక్ డౌన్ సమయంలోను ఇంటి పట్టునే ఉన్నాడు. 
 
అయితే లాక్ డౌన్‌కు ముందు మరదలు సంతోష్ ఇంటికి వచ్చింది. విద్యనభ్యసించేందుకు సంతోష్ ఇంటికి పంపారు జ్యోతిని. సంతోష్‌కు పెళ్ళయినా జ్యోతి మాత్రం అతనిపై మనస్సు పడింది. ఎప్పుడు రాణి ఇంటి నుంచి వెళుతుందా అని కాచుకు కూర్చుంది. 
 
డెలివరీ కోసం నెల క్రితం పుట్టింటికి వెళ్ళింది రాణి. ఇదే అదునుగా సంతోష్, జ్యోతిలు బాగా సన్నిహితమయ్యారు. వారి రాసలీలలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం అత్తింటివారికి తెలిసింది. మారమన్నారు. మారలేదు.
 
దీంతో సంతోష్‌ను బావమరిది స్కెచ్ వేసి తన స్నేహితులతో కలిసి హత్య చేశారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments