Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య డెలివరీకి పుట్టింటికి వెళితే మరదలితో భర్త ఎంజాయ్, చివరికి?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:31 IST)
డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. మరదలు చదువుకునేందుకు ఇంటికి వచ్చింది. లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. డెలివరీ కోసం వెళ్ళిన భార్య రావడానికి సమయం పడుతుందని మరదలికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఎంజాయ్ చేశాడు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
 
హైదరాబాద్ నగరంలోని హఫీజ్ బాబానగర్ ఆక్తర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సంతోష్, రాణిలు నివాసముండేవారు. సంవత్సరం క్రితమే వీరికి పెళ్ళయ్యింది. అన్యోన్యంగా ఉన్నారు. ఆర్థికంగా సంతోష్ బాగా ఉండడంతో లాక్ డౌన్ సమయంలోను ఇంటి పట్టునే ఉన్నాడు. 
 
అయితే లాక్ డౌన్‌కు ముందు మరదలు సంతోష్ ఇంటికి వచ్చింది. విద్యనభ్యసించేందుకు సంతోష్ ఇంటికి పంపారు జ్యోతిని. సంతోష్‌కు పెళ్ళయినా జ్యోతి మాత్రం అతనిపై మనస్సు పడింది. ఎప్పుడు రాణి ఇంటి నుంచి వెళుతుందా అని కాచుకు కూర్చుంది. 
 
డెలివరీ కోసం నెల క్రితం పుట్టింటికి వెళ్ళింది రాణి. ఇదే అదునుగా సంతోష్, జ్యోతిలు బాగా సన్నిహితమయ్యారు. వారి రాసలీలలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం అత్తింటివారికి తెలిసింది. మారమన్నారు. మారలేదు.
 
దీంతో సంతోష్‌ను బావమరిది స్కెచ్ వేసి తన స్నేహితులతో కలిసి హత్య చేశారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments