Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ విచారణకు హాజరుకాలేను... మా ఆడిటర్ వస్తారు : మంత్రి మల్లారెడ్డి లేఖ

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (15:33 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి గృహాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇలా మొత్తం 16 మందికి నోటీసులు ఇచ్చారు. 
 
అయితే, మంత్రి మల్లారెడ్డి మాత్రం ఐటీ అధికారుల విచారణకు సోమవారం హాజరుకాలేదు. పైగా, తాను హాజరుకాలేనని, తన తరపున ఆడిటర్ హాజరవుతారంటూ ఐటీ అధికారులకు ఓ లేఖ రాశారు. 
 
ఉప్పల్‌లో జరగనున్న పలు కార్యక్రమాల్లో తాను పాల్గొనాల్సివుందని అందుకే విచారణకు వెళ్లలేక పోతున్నానని చెప్పారు. నోటీసులు అందుకున్న ఇతరులంతా విచారణకు హాజరవుతారని తెలిపారు. మరోవైపు, విచారణ నేపథ్యంలో ఐటీ కార్యాలయం వద్ద గట్టి భద్రతను కల్పించారు. 
 
కాగా, ఈ సోదాలకు సంబంధించిన ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులు అందుకున్న వారిలో మంత్రి మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, కీర్తిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రేయా రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, నర్సింహా యాదవ్, జైకిషన్, రాజేశ్వర్ రావు, ఇద్దరు ప్రిన్సిపాళ్లు ఉన్నారు. వీరి వద్ద మూడు రోజుల పాటు విచారణ సాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments