Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ తాగి మాట్లాడుతున్నారా? మగాడైతే నిలబడాలి: యాష్కీ సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు సన్నాసులని, చిప్పకూడు తింటారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నే

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (16:24 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు సన్నాసులని, చిప్పకూడు తింటారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి రాబందుల పార్టీ అని.. తెరాస నేతలు చదువురాని మూర్ఖులంటూ విమర్శలు గుప్పించారు. 
 
కేసీఆర్ సవాల్ చేసి పారిపోవడం కాదని.. మగాడైతే నిలబడాలని సవాల్ విసిరారు. కేసులు పెట్టి చిప్పకూడు తినిపిస్తామన్న కేసీఆర్ బెదిరింపులకు ఏమాత్రం భయపడే ప్రసక్తే లేదని యాష్కీ స్పష్టం చేశారు. కేసీఆర్ తాగి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.
 
మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని దగా ఒప్పందంగా అభివర్ణించిన మధుయాష్కి మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. మరో సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలులో పెట్టి చిప్పకూడు తినిపిస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించడం దారుణమన్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments