Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల దాడులపై స్పందిస్తే వ్యభిచారిణిగా ముద్రవేస్తారా? ఎవరు?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (08:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఇప్పటికే వందకు పైగా ఆలయాలపై దాడులు జరిగినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడులను విపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అలాగే, బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత కూడా ఖండించారు. ఆలయాలపై దాడులను ఖండిస్తూ, ప్రభుత్వంపై ఆమె ఘాటైన విమర్శలే చేశారు. దీంతో ఆమెపై వైకాపా నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై, తనపై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
"ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించినందుకు వ్యభిచారిణిగా, తిరుగుబోతుగా ముద్రవేస్తారా? ఇంత దారుణంగా వేధిస్తారా? నాపై వ్యక్తిగత విమర్శలకు దిగి, ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తెస్తే.. ఎవరినైనా సరే చంపేస్తా" అని మాధవీలత హెచ్చరించారు. 
 
సోషల్‌ మీడియాలో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అశ్లీల పోస్టులు పెట్టి, అసభ్యకర రాతలు రాసి ట్రోల్‌ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘విజయ్‌ మహరాజ్‌ అనే వ్యక్తి నన్ను టార్గెట్‌ చేసి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు, మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడు. నన్ను అసభ్యకరంగా చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు ధర్నా చేస్తా అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments