Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల దాడులపై స్పందిస్తే వ్యభిచారిణిగా ముద్రవేస్తారా? ఎవరు?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (08:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఇప్పటికే వందకు పైగా ఆలయాలపై దాడులు జరిగినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడులను విపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అలాగే, బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత కూడా ఖండించారు. ఆలయాలపై దాడులను ఖండిస్తూ, ప్రభుత్వంపై ఆమె ఘాటైన విమర్శలే చేశారు. దీంతో ఆమెపై వైకాపా నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై, తనపై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
"ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించినందుకు వ్యభిచారిణిగా, తిరుగుబోతుగా ముద్రవేస్తారా? ఇంత దారుణంగా వేధిస్తారా? నాపై వ్యక్తిగత విమర్శలకు దిగి, ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తెస్తే.. ఎవరినైనా సరే చంపేస్తా" అని మాధవీలత హెచ్చరించారు. 
 
సోషల్‌ మీడియాలో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అశ్లీల పోస్టులు పెట్టి, అసభ్యకర రాతలు రాసి ట్రోల్‌ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘విజయ్‌ మహరాజ్‌ అనే వ్యక్తి నన్ను టార్గెట్‌ చేసి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు, మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడు. నన్ను అసభ్యకరంగా చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు ధర్నా చేస్తా అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments