Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపిన మంత్రి కేటీఆర్

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (17:51 IST)
తనపై అసత్య ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం పరువు నష్టం దావాకు సంబంధించి లీగల్ నోటీసులు పంపించారు. 
 
మంత్రి కేటీఆర్ నిర్వాహకం వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఇటీవల బండి సంజయ్ ఆరోపించారు. ఈ మరణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని లేదా వెనక్కి తీసుకోవాలని లేదా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 
 
అయితే, బండి సంజయ్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని లేనిపషంలో పరువు నష్టం దావా వేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసులపై బండి సంజయ్ స్పందించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments