Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిసాన్‌ నమ్మాన్‌ నిధికి రైతుబంధు పథకమే స్ఫూర్తి.. కేటీఆర్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (15:26 IST)
కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న కిసాన్‌ నమ్మాన్‌ నిధి పథకానికి మన రైతుబంధు పథకమే స్ఫూర్తి అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ అన్నదాత జీవతాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల జీవితాల్లో గణనీయ ప్రగతి వచ్చిందన్నారు. 
 
తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం బోరుబావులపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఉండేది. అర్ధరాత్రులు విద్యుత్‌ కోసం పొలాల వద్ద పడిగాపులు గాయాల్సిన వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చిందని గుర్తుచేశారు.
 
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తన తాతయ్య-నానమ్మ పేరిట సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికల్లో అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments