'ఉమ్మడి'గానే బాగున్నది.. తెలంగాణ కోసం కొట్లాడి బాధపడుతున్నా...

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (12:47 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన రాజకీయ నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన ఎంపీగా ఉన్నారు. ఇపుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని బాగుండేవన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినందుకు ఇపుడు బాధపడుతున్నట్టు తెలిపారు.
 
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మాటలు విన్న తర్వాత రాష్ట్రం ఉమ్మడిగానే ఉంటే బాగుండేదని తనకు అనిపిస్తోందన్నారు. గతంలో ఎంపీగా పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
 
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ వచ్చిందని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే పార్టీని కరోనా వైర్‌సతో పోల్చడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను గౌరవించాలన్న ఇంగితజ్ఞానం సీఎంకు లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆదిష్టానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. పార్టీ సరైన నిర్ణయం తీసుకోకుంటే తమదారి తాము చూసుకుంటామన్నారు. 
 
తమ పార్టీ ఎంపీ ఏ.రేవంత్‌ రెడ్డి విషయంలో పార్టీకి నష్టం కలిగించేలా కొందరు నాయకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జూనియర్లను ప్రోత్సహించాల్సింది పోయి.. విమర్శలు చేయడం సరికాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments