Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్విజయ్ సింగ్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : కిషన్ రెడ్డి

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (14:37 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. మస్లీస్ పార్టీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. 
 
కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ ఎంఐఎంకు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అండతోనే మేయర్ పదవిలో ఎంఐఎం కొనసాగుతుందనే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ జ్ఞప్తికి తెచ్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. 
 
ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ విశ్వాస పరీక్షకు ఎంఐఎం దూరంగా ఉండి బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీని గెలిపించేందుకు అక్కడ ఎంఐఎం పోటీకి దిగుతుందని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments