Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు మహిళా పోలీసులు... మూడు తప్పులు.. ఏంటవి?

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (09:56 IST)
సమాజం కోసం బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ముగ్గురు మహిళా పోలీసులు మూడు తప్పులు చేశారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అపరాధం విధించారు. ఇంతకీ ఆ ముగ్గురు పోలీసులు చేసిన తప్పులేంటో తెలుసుకుందాం. 
 
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు.. ఆ ముగ్గురూ ఒకే స్కూటీ ఎక్కారు. శిరస్త్రాణాం ధరించలేదు. పైగా రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్‌ఫోన్‌లో సంభాషించారు. ఇలా ట్రాఫిక్‌ నిబంధనల పరంగా ఒకటి కాదు.. మూడు ఉల్లంఘనలకు పాల్పడిన తీరుపై నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. 
 
ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన షర్మిల సభ కోసం ఈ ముగ్గురూ విధులు నిర్వహించేందుకు ఇలా ఒకే బైక్‌ మీద వెళ్లారు. వీరు ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో నుంచి వెళుతుండగా కొందరు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. 
 
గత రెండ్రోజులుగా ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కాగా మహిళా కానిస్టేబుళ్ల ఈ నిర్లక్ష్యంపై ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ సీరియస్‌ అయ్యారు. వారికి రూ.3300 జరిమానా విధించాలని, అలాగే శాఖాపరమైన చర్యలూ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments