ముగ్గురు మహిళా పోలీసులు... మూడు తప్పులు.. ఏంటవి?

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (09:56 IST)
సమాజం కోసం బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ముగ్గురు మహిళా పోలీసులు మూడు తప్పులు చేశారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అపరాధం విధించారు. ఇంతకీ ఆ ముగ్గురు పోలీసులు చేసిన తప్పులేంటో తెలుసుకుందాం. 
 
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు.. ఆ ముగ్గురూ ఒకే స్కూటీ ఎక్కారు. శిరస్త్రాణాం ధరించలేదు. పైగా రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్‌ఫోన్‌లో సంభాషించారు. ఇలా ట్రాఫిక్‌ నిబంధనల పరంగా ఒకటి కాదు.. మూడు ఉల్లంఘనలకు పాల్పడిన తీరుపై నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. 
 
ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన షర్మిల సభ కోసం ఈ ముగ్గురూ విధులు నిర్వహించేందుకు ఇలా ఒకే బైక్‌ మీద వెళ్లారు. వీరు ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో నుంచి వెళుతుండగా కొందరు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. 
 
గత రెండ్రోజులుగా ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కాగా మహిళా కానిస్టేబుళ్ల ఈ నిర్లక్ష్యంపై ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ సీరియస్‌ అయ్యారు. వారికి రూ.3300 జరిమానా విధించాలని, అలాగే శాఖాపరమైన చర్యలూ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments