తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో టాలీవుడ్ ప్రముఖ హీరోలు పాల్గొన్నారు. దగ్గుబాటి రానా, అక్కినేని నాగార్జునలు మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం దాదాపు చేరుకునేట్లే కనబడుతోం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో టాలీవుడ్ ప్రముఖ హీరోలు పాల్గొన్నారు. దగ్గుబాటి రానా, అక్కినేని నాగార్జునలు మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా సోమవారం నాడు 25 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం దాదాపు చేరుకునేట్లే కనబడుతోంది. పలు గ్రామాలు, నగరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా నడుస్తోంది.
కాగా రాశి, జన్మనక్షత్రం ప్రకారం మొక్కలు అందిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పడంతో చాలామంది వారివారి రాశి ఫలితాలను అనుసరించి మొక్కలు నాటుతున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్, అర్జున్ భార్య స్నేహ రెడ్డి, తనయుడు అయాన్లు వారివారి జన్మ నక్షత్రాలను అనుసరించి మొక్కలు నాటారు.