Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీపై కేసీఆర్‌ గుర్రు

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (10:14 IST)
విద్యుత్తు కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్న బీజేపీపై సీఎం కేసీఆర్‌ గుర్రుగా ఉన్నారు. తక్కువ ధరకు కేంద్రం ఇస్తానన్నా, కమీషన్ల కోసమే ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేశారన్న  రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు.

విద్యుత్తు శాఖపై బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని, కమలనాథులను కడిగేయాలని పార్టీ యంత్రాంగంతోపాటు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘‘మణుగూరులో సబ్‌ క్రిటికల్‌ ప్లాంటుకు అనుమతి ఇచ్చింది బీజేపీ ప్రభుత్వానికి చెందిన కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి కాదా?

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అధికారంలో ఉన్నప్పుడు 1000 మెగావాట్ల విద్యుత్తుకు ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థతోనే ఒప్పందం జరిగింది. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడిది?

తెలంగాణ ఆవిర్భావ సమయంలో సౌర విద్యుత్తు 77 మెగావాట్లే. సౌర విద్యుత్తు పాలసీ తర్వాత దాని సామర్థ్యం 3600 మెగావాట్లకు చేరింది. దాంతో, జాతీయ స్థాయిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ సన్మానం కూడా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments