బీజేపీపై కేసీఆర్‌ గుర్రు

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (10:14 IST)
విద్యుత్తు కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్న బీజేపీపై సీఎం కేసీఆర్‌ గుర్రుగా ఉన్నారు. తక్కువ ధరకు కేంద్రం ఇస్తానన్నా, కమీషన్ల కోసమే ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేశారన్న  రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు.

విద్యుత్తు శాఖపై బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొట్టాలని, కమలనాథులను కడిగేయాలని పార్టీ యంత్రాంగంతోపాటు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘‘మణుగూరులో సబ్‌ క్రిటికల్‌ ప్లాంటుకు అనుమతి ఇచ్చింది బీజేపీ ప్రభుత్వానికి చెందిన కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి కాదా?

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అధికారంలో ఉన్నప్పుడు 1000 మెగావాట్ల విద్యుత్తుకు ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థతోనే ఒప్పందం జరిగింది. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడిది?

తెలంగాణ ఆవిర్భావ సమయంలో సౌర విద్యుత్తు 77 మెగావాట్లే. సౌర విద్యుత్తు పాలసీ తర్వాత దాని సామర్థ్యం 3600 మెగావాట్లకు చేరింది. దాంతో, జాతీయ స్థాయిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ సన్మానం కూడా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments