Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నాల భూకబ్జాపై హౌస్ కమిటీ ఏర్పాటుకు సై : కేసీఆర్ వెల్లడి

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (16:15 IST)
తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భూకబ్జాలపై హౌస్ కమిటీ వేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. అసైన్డ్ భూములను పొన్నాల కొనుగోలు చేసిన అంశంపై తెలంగాణ సభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఇందులో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. పొన్నాల కొనుగోలు చేసిన అసైన్డ్ భూములతో పాటు.. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అసైన్డ్‌ భూముల కబ్జాపై సభా సంఘం వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. 
 
గత ప్రభుత్వమే పొన్నాల భూమిని రద్దు చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 90 వేల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాలో ఉందని చెప్పారు. అంతకుముందు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని, ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పలేదని ఆరోపించారు. ఆ భూముల్లో ఫౌల్ట్రీ ఫామ్ను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు.
 
నిబంధనలకు విరుద్ధంగా పొన్నాల వద్ద 8.3 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 2005లో మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు భూమిని ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. ఎకరాకు రూ.25,500లకే కేటాయించారని హరీష్రావు తెలిపారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం కానీ, విక్రయిచండ కాని చేయకూడదని ఆయన వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments