Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు-కేసీఆర్ ఫోటోల వార్... ఇద్దరు ఫోటోలు పీకేశారు...

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (16:01 IST)
తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య ఎలాంటి గొడవలు ఇప్పటికైతే లైవు కానీ నాయకుల మధ్య మాత్రం ఈ గొడవలు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాదులోని గురజాడ హాలులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఐతే అంతకుముందు ఆ హాలులో అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలు గోడలకు వేలాడుతూ ఉన్నాయి. 
 
సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నేపధ్యంలో అటువైపు ఉన్న కేసీఆర్ ఫోటోను తీసేసి కిందపెట్టేశారు కొందరు అధికారులు. దీనిపై తెలంగాణ అధికార బృందం అభ్యంతరం పెట్టింది. వెంటనే ఫోటోను తగిలించాలని కోరింది. ఐతే అందుకు ఏపీ అధికారులు ఒప్పుకోకపోవడంతో వారు నేరుగా వెళ్లి గోడకు తగిలించి ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటోను తీసేసి కింద పెట్టేశారు. ఇలా ఎవరి ఫోటోను అక్కడ లేకుండా చేశారు. 
 
ఇంతలో ఏపీ సీఎం రావడం, మీడియా సమావేశంలో మాట్లాడటం, వెళ్లిపోవడమూ జరిగిపోయింది. కానీ ఫోటోలను తగిలించేందుకు మాత్రం ఎవ్వరి గొడవ వాళ్లదే అన్నట్లుగా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments