ఎన్నికలంటే.. కొన్ని పార్టీలకు గేమ్.. టీఆర్ఎస్‌కి మాత్రం టాస్క్- కేసీఆర్

ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక మేనిఫెస్టోను రూపొందించారు

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (12:57 IST)
ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక మేనిఫెస్టోను రూపొందించారు. ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఆసరా పెన్షన్లను రూ.2,016గా పెంచుతామని చెప్పారు. అంతేగాకుండా.. 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్‌ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు పెన్షన్లు రూ.3,016 అందిస్తామన్నారు. 
 
ఇక నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తామని చెప్పి, ప్రతిపక్షాల కంటే, ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామని చెప్పకనే చెప్పారు. సొంత స్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు గేమ్‌లాంటిదని, టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం టాస్క్‌ వంటిదన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెప్తామని తెలిపారు. 
 
కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని, మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింతగా బయటకు లాగుతామని చెప్పారు. చంద్రబాబు వచ్చి, ఆంధ్రా-తెలంగాణ గొడవలు పెడదామనుకుంటున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్. తెలంగాణలో ఉన్నవాళ్లంతా, తెలంగాణవారేనని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments