తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా 27 యేళ్ల టెన్నిస్ తార సానియా మీర్జాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నియమించారు. ఇకపై ఆమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు భారత్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రచారకర్తగా ఉంటారని తెలిపారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమెకు నియామక పత్రంతో పాటు కోటి రూపాయల చెక్ కూడా అందించారు. కేసీఆర్ మంగళవారం పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా సానియా నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... సానియాను చూసి తెలంగాణ గర్విస్తోందని అన్నారు.
ప్రస్తుతం మహిళల డబుల్స్ ర్యాంకుల్లో ఐదో స్థానంలో ఉన్న ఆమె అంతర్జాతీయ ర్యాంకుల్లో నెంబర్ వన్గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, సోమవారం కేసీఆర్ను సానియా మీర్జా కలిసి అభినందనలు తెలిపిన విషయం తెల్సిందే.