Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ నుంచి నేతలు జూపల్లి - పొంగులేటి సస్పెన్స్

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (14:08 IST)
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఇద్దరు సీనియర్ నేతలపై సస్పెన్షన్ వేటుపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం వెలువరించినట్టు కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, తనను పార్టీ సస్పెన్షన్ వేటువేయడంపై జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తనను సస్పెండ్ చేసినట్టు వినగానే పంజరంలో నుంచి బయటపడిన చిలుకలా అనిపించిందని అన్నారు. ఇన్నాళ్లూ తాను పార్టీలో ఉన్నట్టా లేనట్టా అని అడిగారు. నేనైతే పార్టీలో ఉన్నట్టు ఎక్కడా చెప్పలేనని, ఇపుడు తనను సస్పెండ్ చేశామంటున్నారు. 
 
కాబట్టి ఇప్పటివరకు పార్టీలోనే ఉన్నట్టు తెలిసిందని అన్నారు. పైగా, తనను ఎందుకు సస్పెండ్ చేశారో, తాను అడిగిన ప్రశ్నల్లో అబద్ధాలు ఉన్నాయా అని అడిగారు. ఒకవేళ తన మాటలు అబద్ధాలని అంటే నిజా నిజాలు నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు జూపల్లి సవాల్ విసిరారు. తన ప్రశ్నలకు బదులివ్వలేక సస్పెండ్ చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments