బీఆర్ఎస్ నుంచి నేతలు జూపల్లి - పొంగులేటి సస్పెన్స్

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (14:08 IST)
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఇద్దరు సీనియర్ నేతలపై సస్పెన్షన్ వేటుపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం వెలువరించినట్టు కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, తనను పార్టీ సస్పెన్షన్ వేటువేయడంపై జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తనను సస్పెండ్ చేసినట్టు వినగానే పంజరంలో నుంచి బయటపడిన చిలుకలా అనిపించిందని అన్నారు. ఇన్నాళ్లూ తాను పార్టీలో ఉన్నట్టా లేనట్టా అని అడిగారు. నేనైతే పార్టీలో ఉన్నట్టు ఎక్కడా చెప్పలేనని, ఇపుడు తనను సస్పెండ్ చేశామంటున్నారు. 
 
కాబట్టి ఇప్పటివరకు పార్టీలోనే ఉన్నట్టు తెలిసిందని అన్నారు. పైగా, తనను ఎందుకు సస్పెండ్ చేశారో, తాను అడిగిన ప్రశ్నల్లో అబద్ధాలు ఉన్నాయా అని అడిగారు. ఒకవేళ తన మాటలు అబద్ధాలని అంటే నిజా నిజాలు నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు జూపల్లి సవాల్ విసిరారు. తన ప్రశ్నలకు బదులివ్వలేక సస్పెండ్ చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments