Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ భారీ విగ్రహం... 28న ఆవిష్కరణ

Webdunia
బుధవారం, 3 మే 2023 (13:18 IST)
ఖమ్మం జిల్లాలోని లంకారం ట్యాంక్ బండ్‌పై స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆవిష్కరించనున్నారు. శ్రీకృష్ణుడి అవతారంలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహం ఎత్తు దాదాపు 54 అడుగుల మేరకు ఉంది.
 
ఈ విగ్రహ ఆవిష్కరణపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌ నగరంలోని ఆయన నివాసంలో కలుసుకుని, విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పటికే విగ్రహం తయారీ పూర్తయి తరలింపునకు సిద్ధంగా ఉంది. ఈ విగ్రహాన్ని బేస్‌మెంట్‌తో కలిపి మొత్తం 54 అడుగులు వస్తుంది. 
 
ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీరం ఎత్తు 45 అడుగులుగా ఉంది. ఎటు చూసినా 36 అడుగులు పొడవు, వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్‌పై ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం రూ.2.3 కోట్లను వెచ్చించారు. ఈ విగ్రహం తయారీ, ఏర్పాటులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక భూమిక పోషించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments