Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి ఈటెల రాజేందర్.. జేపీ నడ్డాతో 45 నిమిషాల పాటు భేటీ

Webdunia
సోమవారం, 31 మే 2021 (22:02 IST)
టీఆర్ఎస్ గూటి నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలోకి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలంగాణ మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక సూచనలు చేశారు. త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో కలిసి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. 
 
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. అందులో తన పాత్ర ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయన జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలుస్తోంది.
 
తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు ప్రస్తుతం అనువైన పరిస్థితులు ఉన్నాయని జేపీ నడ్డాకు వివరించిన ఈటల రాజేందర్.. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అందుకు తగ్గట్టుగా నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించినట్టు సమాచారం. 
 
జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ సుమారు 45 నిమిషాలు పాటు సమావేశమైనట్టు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. అయితే ఆయన ఎప్పుడు పార్టీలో చేరే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments