Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీని గెంటేసి.. జగ్గారెడ్డిని ఆహ్వానించారు : హరీష్ రావు

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2014 (11:17 IST)
అద్వానీ వంటి అగ్రనేతలను బయటకు పంపించి జగ్గారెడ్డి వారిని బీజేపీ నేతలు ఆహ్వానించారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని పోటీకి దించడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. జగ్గారెడ్డిని అభ్యర్థిగా నిలపడాన్ని మెదక్ జిల్లాలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. 
 
ఇప్పటికే మెదక్‌లో ప్రజలు తమకు పట్టం కట్టారని, అది కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వవద్దన్న జగ్గారెడ్డిని కాంగ్రెసు పార్టీ నుంచి తీసుకొని బీజేపీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చారని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఓడించారని గుర్తు చేశారు. బీజేపీ తీరు విచిత్రంగా మారిందని, పార్టీ కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర చేసిన అద్వానీని జాతీయ స్థాయిలో పక్కకు పెట్టారని, క్షేత్రస్థాయిలో బీజేపీ కోసం పని చేసిన వారిని కాదని జగ్గారెడ్డి వంటి వారిని చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments