Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఫూన్ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదు : జగన్ స్పష్టీకరణ

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (10:21 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని, శుక్రవారం సభలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రకటించారు. దీంతో బఫూన్ వ్యాఖ్యలపై శనివారం కూడా సభ దద్ధరిల్లిపోయే అవకాశం ఉంది. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ సభ్యులిరువురు ఈ విషయంలో మొండిపట్టుదలతో ఉండటంతో అసెంబ్లీలో శనివారం కూడా ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవు. 
 
'బఫూన్' వ్యాఖ్యలపై జగన్ తమకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. క్షమాపణలు చెప్పే వరకు సభను సాగనివ్వమని వారు మంకుపట్టు పడుతున్నారు. అలాగే, వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గేలా కనపడటం లేదు. 
 
అసెంబ్లీ‌లో టీడీపీ సభ్యులపై తాను చేసిన బఫూన్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... నిన్న అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత జగన్ స్పష్టం చేశారు. అయితే, ముందుగా తన కుటుంబంపై టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే... తాను కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి భేషజాలకు పోదలుచుకోలేదని ఆయన అన్నారు.  

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments