మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు ... నిఘా విభాగం నిర్ణయం

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (17:20 IST)
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పోలీస్ భద్రతను పెంచింది. ఈయన్ను హత్య చేసేందుకు రూ.15 కోట్ల సుపారీతో ఓ కిరాతక ముఠా పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు చేధించిన విషయం తెల్సిందే. ఈ ప్లాన్ అమలుకు ముందే బయటపడింది. దీంతో శ్రీనివాస్ గౌడ్‍‌కు ప్రాణాపాయం తప్పింది. 
 
అయితే, మంత్రి హత్యకు కుట్ర, తదనంతర పరిణామాలను పరిశీలించిన రాష్ట్ర నిఘా విభాగం తాజాగా ఆయనకు భద్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని నిఘా విభాగ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వెంట జార్ఖండ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రానికి సాయంత్రానికి తిరిగిరానున్నారు. రాష్ట్రానికి వచ్చిన మరుక్షణమే ఆయనకు భద్రత పెంచాలని నిఘా విభాగం అధికారులు నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకర్థమవుంది... ఈ సినిమాతో ఒక్కొక్కరిని కొడతాను చూడు.... : సమంత

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు

Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments