Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకింది.. ఎవరూ తాకొద్దు.. వివాహిత ఆత్మహత్య

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (13:09 IST)
ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తనకు కరోనా సోకిందనీ, అందువల్ల తనను ఎవరూ తాకొద్దని సూసైడ్ నోట్ రాసిపెట్టి ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లాకు చెందిన 37 యేళ్ల మహిళ తన భర్త, కొడుకు (12)తో కలసి అల్కాపూర్‌లో నివసిస్తోంది. ఈమె ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
శనివారం రాత్రి భోజనాల తర్వాత అందరూ కలిసే నిద్రపోయారు. ఉదయం 10 గంటల సమయంలో నిద్రలేచిన భర్త.. భార్య కనిపించకపోవడంతో పక్కగదిలోకి వెళ్లి చూడగా, అక్కడ భార్య ఫ్యాన్‌కు విగతజీవిలా వేలాడుతూ కనిపించింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఓ లేఖ దొరికింది. తనకు కరోనా సోకిందని, తనను ఎవరూ తాకవద్దని అందులో రాసిపెట్టి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఎక్కడ పరీక్షలు చేయించుకుంది? ఫలితం ఎప్పుడు వచ్చింది? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments