Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి భార్యతో నగరానికి.. ప్రశ్నించిన భర్త తరఫు బంధువుపై దాడి

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (09:01 IST)
హైదరాబాద్ నగరంలో స్నేహితుడి భార్యతో ఓ వ్యక్తి నగరానికి వచ్చాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ భర్త తరపు బంధువును ప్రశ్నించాడు. అంతే.. అతనిపై దాడి చేయడంతో  మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన అంకిత్‌ శుక్లా, యోగేష్‌ అట్లా అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. యోగేష్‌ అనే వ్యక్తి హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో వ్యాపారం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం ఇండోర్‌కు వెళ్లి స్నేహితుడైన అంకిత్‌ భార్యను నగరానికి తీసుకొచ్చాడు. 
 
వీరిద్దరూ కలిసి కుందన్‌బాగ్‌లో అద్దె ఇంట్లో ఉంచాడు. అంకిత్‌ తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కుందన్‌బాగ్‌లో ఉన్నట్టు గుర్తించారు. జనవరి 29న అంకిత్‌ అతని మామ విశ్వసుందర్‌ శుక్లా(65) నగరానికి వచ్చి యోగేష్‌ను నిలదీయగా శుక్లాపై చేయిచేసుకొని తోసివేశాడు.
 
తలకు తీవ్ర గాయమైన అతని ఉస్మానియాకు తరలించగా మరణించాడు. యోగేష్‌పై హత్యానేరం కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. అలాగే, అంకిత్ భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments