Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి భార్యతో నగరానికి.. ప్రశ్నించిన భర్త తరఫు బంధువుపై దాడి

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (09:01 IST)
హైదరాబాద్ నగరంలో స్నేహితుడి భార్యతో ఓ వ్యక్తి నగరానికి వచ్చాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ భర్త తరపు బంధువును ప్రశ్నించాడు. అంతే.. అతనిపై దాడి చేయడంతో  మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన అంకిత్‌ శుక్లా, యోగేష్‌ అట్లా అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. యోగేష్‌ అనే వ్యక్తి హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో వ్యాపారం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం ఇండోర్‌కు వెళ్లి స్నేహితుడైన అంకిత్‌ భార్యను నగరానికి తీసుకొచ్చాడు. 
 
వీరిద్దరూ కలిసి కుందన్‌బాగ్‌లో అద్దె ఇంట్లో ఉంచాడు. అంకిత్‌ తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కుందన్‌బాగ్‌లో ఉన్నట్టు గుర్తించారు. జనవరి 29న అంకిత్‌ అతని మామ విశ్వసుందర్‌ శుక్లా(65) నగరానికి వచ్చి యోగేష్‌ను నిలదీయగా శుక్లాపై చేయిచేసుకొని తోసివేశాడు.
 
తలకు తీవ్ర గాయమైన అతని ఉస్మానియాకు తరలించగా మరణించాడు. యోగేష్‌పై హత్యానేరం కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. అలాగే, అంకిత్ భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments