Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన సెల్ఫీ.. క్వారీ గుంతలో పడి...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సెల్ఫీ ముగ్గురి ప్రాణాలు తీసింది. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో జారిపడి జలసమాధి అయ్యారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బోరబండకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పీఎన్ సూర్య (20), సోదరుడు పీఎన్ చంద్ర (16) భార్గవ్ (17), సయ్యద్ ఉవేజ్, సంవీత్‌తో కలిసి కొత్వాల్‌గూడ సమావేశంలోని మానసహిల్స్ క్వారీకి ఆదివారం వచ్చారు. క్వారీ నీటి గుంతల వద్ద తిరుగాడుతూ సెల్ఫీలు దిగుతూ కొద్దిసేపు ఉత్సాహంగా గడిపారు. 
 
ఇంతలో సోదరులు సూర్య, చంద్రతోపాటు మరో విద్యార్థి భార్గవ్ సెల్ఫీ దిగేక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడం వల్లే మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడే ఉన్న మిగతా ఇద్దరు ఘటన వివరాలను మృతుల కుటుంబీకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్టీఐఏ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments