Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి సండే ట్రాఫిక్ ఆంక్షలే ... సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు..

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (08:56 IST)
సాధారణంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ ఆదివారాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇకపై ప్రతి ఆదివారం ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం నిర్ణయించింది. 
 
వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్‌ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా దానిపై ఆయన వెంటనే స్పందించారు. 
 
ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీనికి అనుగుణంగా వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు. 
 
ఈ కొత్త నిర్ణయంతో హైదరాబాద్ నగరంలో ఎప్పుడు రద్దీగా ఉండే ట్యాంక్ బండ్‌పై ఇకపై ప్రతి ఆదివారం కాస్త ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సిరానుంది. అదేసమయంలో ట్రాఫిక్ మళ్లింపు నిర్ణయంతో ట్యాంక్ బండ్ వీక్షణకు మరింతమంది సందర్శకులు తరలివస్తారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments