నేనొక అమ్మాయిని లవ్ చేశారు.. ఫ్రెండ్స్‌, ఆమె మోసం చేశారు.. చనిపోతున్నా...

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (12:07 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి తన ప్రియురాలితో పాటు.. స్నేహితుల చేతిలో మోసపోయాడు. దీంతో ఇక జీవించడం వృథా అనుకుని లైవ్‌లో ఉరివేసుకున్నాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరం వనస్థలిపురం, ముండ్లమూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముండ్లమూరు మండలం, పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం (36) లారీ యజమాని. ఇతనికి భార్య ఖాసీంబి, కుమారుడు (10), కుమార్తె (8) ఉన్నారు. 
 
ఆర్థికంగా నష్టపోయిన అతను శనివారం ఉదయం తన స్నేహితుడు వేణుగోపాల్‌తో కలిసి వనస్థలిపురం వీఎంఆర్‌ లాడ్జ్‌ అండ్‌ బార్‌లో గది అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం ఇద్దరు కలిసి మద్యం తాగి గదికి వెళ్లి పడుకున్నారు. 
 
తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం తాగుతుండగా.. షేక్‌ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ తాను ప్రేమించి మోసపోయానని, స్నేహితులూ మోసం చేశారని, చనిపోతున్నానంటూ సీలింగ్‌ ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకున్నాడు. 
 
తన స్నేహితుడు ఎంతకీ కిందకు రాకపోవడంతో వేణుగోపాల్ ఫోన్‌ చేశాడు.. స్పందించకపోవడంతో గదికి వెళ్లాడు. కిటికిలోంచి చూసే సరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. సిబ్బంది గది తలుపులు తెరిచి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments