Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్: వాగులో కొట్టుకుపోయిన మహిళ.. చివరికి?

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (10:18 IST)
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో వాగుల్లా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఓ మహిళ కాలువలో పడి మృతి చెందింది. మహిళను రక్షించేందుకు స్థానికులు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కిలోమీటరు దూరంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.
 
స్కందగిరి ఆలయంలో భిక్షాటన చేస్తున్న మహిళ(45) గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో దూద్ బావి వద్ద కాలువ దాటేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది.
 
మహిళ కాలువలో కొట్టుకుపోవడంపై స్థానికులు స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. 
 
చివరకు వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్‌లో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతి చెందిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments