Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగను పట్టుకోవాల్సిన ఎస్సై తానే దొంగగా మారాడు.. ఎందుకంటే...

దొంగను పట్టుకోవాల్సిన ఎస్సై తానే దొంగగా మారిన ఘటన హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని అల్మాస్‌గూడ శ్రీశ్రీహోంలో శివప్రసాద్ అ

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (10:44 IST)
దొంగను పట్టుకోవాల్సిన ఎస్సై తానే దొంగగా మారిన ఘటన హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... బడంగ్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని అల్మాస్‌గూడ శ్రీశ్రీహోంలో శివప్రసాద్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఇటీవల ఆయన కుటుంబ సమేతంగా కరీంనగర్‌కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఎస్సై మహేందర్‌రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డాడు. 
 
సరిగ్గా అదేసమయంలో శివప్రసాద్ తన ఇంటికి వచ్చాడు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి నివ్వెరపోయాడు. వెంటనే శివ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు పరుగో పరుగున వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా సామాగ్రి అంతా చిందరవందరగా పడి ఉంది. అప్పుడే ఇంట్లో నుండి మహేందర్‌ రెడ్డి బయటకు వచ్చాడు. 
 
శివప్రసాద్, స్థానికులు అతన్ని పట్టుకుని వివరాలు విచారించగా తాను దొంగనని, ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చానని చెప్పాడు. దీంతో మీర్‌పేట్ పోలీసులకు సమాచారమిచ్చి వారికి అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకున్న మీర్‌పేట పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. చోరీయత్నం కేసు నమోదు చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments