Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఆ కారణంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న బైకర్లు..?

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (10:58 IST)
హైదరాబాదులో దిచక్ర వాహన చోదకుల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు దాదాపు 58 శాతం మంది వున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మే వరకు నమోదైన 363 ఘోర రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో దాదాపు 58 శాతం మంది ద్విచక్ర వాహన చోదకులు, పిలియన్- రైడర్లున్నారు. 
 
జనవరి మరియు మే మధ్య జరిగిన వివిధ ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణించిన 211 మందిలో, 172 మంది డ్రైవర్లు మరియు 39 మంది పిలియన్-రైడర్లు వున్నారు. బాధితుల్లో 191 మంది హెల్మెట్ లేకుండా ఉన్నారని అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో, హెల్మెట్‌లు ఉన్నవారు మరణించారు.
 
మరికొందరు హెల్మెట్ లేకుండా మరణించిన వారున్నారని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎంతగా హెచ్చరించినా వాహనదారులు హెల్మెట్ నిబంధనను పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సీనియర్ పోలీసు అధికారులు ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాల్లో కనీసం 58 శాతం మంది ద్విచక్ర వాహనదారులేనని, వారిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించలేదని సైబరాబాద్ డీసీపీ (ట్రాఫిక్) టి శ్రీనివాసరావు తెలిపారు. సరైన, ప్రామాణికమైన హెల్మెట్ వాడితే రోడ్డు ప్రమాదంలో రైడర్ చనిపోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు.
 
మోటారు సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు లేదా పిలియన్ రైడింగ్ చేసేటప్పుడు మంచి నాణ్యమైన హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని వాహనదారులను కోరారు. పౌరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని శ్రీనివాసరావు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments