హైదరాబాదులో కొత్త జబ్బు.. నల్లిన పోలిన పురుగులతో?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (15:42 IST)
హైదరాబాదును కొత్త వైరస్ పట్టిపీడిస్తోంది. ఒకవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ ముప్పుతో జనం జడుసుకుంటున్న తరుణంలో  నగరంలో స్క్రబ్‌ టైఫస్‌ బాధితులు ఎక్కువయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏకంగా 15 మంది ఈ స్క్రబ్‌ టైఫస్‌ చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ బాధితుల్లో పిల్లలే ఎక్కువమంది ఉన్నారట. ఈ నెలలో నలుగురు చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
 
ఈ స్క్రబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల సోకుతుంది. ఇవి ఇళ్లలో, మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. చూడటానికి ఆ పురుగులు చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయి. 
 
అంతేకాదు ఎక్కువగా రాత్రి సమయాల్లో కనిపిస్తాయి. ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరిలో ఒంటిపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

Trikala Review: కర్మానుసారమే మంచి చెడు అని చెప్పే త్రికాల మూవీ రివ్యూ

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

తర్వాతి కథనం
Show comments