Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లని టవల్‌ను గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు...

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (09:26 IST)
కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా చంపేశాడు. తెల్లని టవల్‌ను గొంతుకు బిగించి ఊపిరాడనీయకుండా చేసి ప్రాణం తీశాడు. ఆ తర్వాత నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పార్థీబస్తీలో నివాసముండే శకత్వాల దర్శన్‌ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారి. ఈసీఐఎల్‌లో కూరగాయలు విక్రయిస్తూ స్వయం ఉపాధిపొందుతున్నాడు. ఈ క్రమంలో సౌందర్య అనే యువతిని ప్రేమించి పెంళ్లి  చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. అయితే, దంపతులిద్దరికీ రోజూ కలిసి మద్యం సేవించే అలవాటు ఉన్నది.
 
అయితే, ఈ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన భార్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ భావించాడు. కానీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో తిరిగి కలిసి జీవనం సాగిస్తున్నారు. అనంతరం గత వారం రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తన భార్యను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం తెల్ల టవల్‌తో భార్య గొంతు బిగించి, హతమార్చాడు. అనంతరం టవల్‌తో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments