Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లని టవల్‌ను గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు...

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (09:26 IST)
కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా చంపేశాడు. తెల్లని టవల్‌ను గొంతుకు బిగించి ఊపిరాడనీయకుండా చేసి ప్రాణం తీశాడు. ఆ తర్వాత నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పార్థీబస్తీలో నివాసముండే శకత్వాల దర్శన్‌ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారి. ఈసీఐఎల్‌లో కూరగాయలు విక్రయిస్తూ స్వయం ఉపాధిపొందుతున్నాడు. ఈ క్రమంలో సౌందర్య అనే యువతిని ప్రేమించి పెంళ్లి  చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. అయితే, దంపతులిద్దరికీ రోజూ కలిసి మద్యం సేవించే అలవాటు ఉన్నది.
 
అయితే, ఈ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన భార్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ భావించాడు. కానీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో తిరిగి కలిసి జీవనం సాగిస్తున్నారు. అనంతరం గత వారం రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తన భార్యను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం తెల్ల టవల్‌తో భార్య గొంతు బిగించి, హతమార్చాడు. అనంతరం టవల్‌తో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments