Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో వరుస హత్యలు - బీరు బాటిల్స్‌తో పొడిచి హత్య

Webdunia
మంగళవారం, 10 మే 2022 (15:01 IST)
భాగ్యనగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో వరుస హత్యలు జరగడం ఇపుడు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తీసుకున్న ఓ వ్యక్తిని బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు. ఈ హత్య హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నంబరు 12లో అర్థరాత్రి జరిగింది. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ హత్య జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు. 
 
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మృతుడి వివరాలు తెలియాల్సివుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ హత్య మద్యం మత్తులో జరిగివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్ష కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments