Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రాలేదని మనస్తాపం.. భర్త బలవన్మరణం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:31 IST)
కట్టుకున్న భార్య కాపురానికి రాలేదన్న మనస్తాపంతో ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్, బంజారా హిల్స్ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ వినాయకనగర్ ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎస్‌పీఆర్‌ హిల్స్‌ వినాయకరావునగర్‌లో నివసించే కె. సాయికిరణ్‌(24) స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న హర్షను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది. 
 
ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో హర్ష పుట్టింటికి వెళ్లిపోయింది. గత ఎనిమిది నెలల నుంచి అదే బస్తీలో ఉండే పుట్టింట్లో ఉంటోంది. ఇంటికి కావాలంటూ సాయికిరణ్ పలుమార్లు వెళ్లి హర్షను కోరాడు. అయినప్పటికీ ఆమె కాపురానికి తిరిగి రాలేదు. దీంతో సాయికిరణ్‌ మనోవేదనకు గురయ్యాడు. 
 
కాపురానికి రమ్మని ఆమెను అడిగినప్పుడల్లా అతడిని కించపరిచే విధంగా మాట్లాడేది. హర్ష మరో వ్యక్తితో చాటింగ్‌ చేస్తుందనే అనుమానంతో సాయికిరణ్‌ ఈనెల 28న ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments