Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో తాగునీటి సరఫరా బంద్.. ఎందుకు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:07 IST)
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నారు. భాగ్యనగరికి తాగునీటి సరఫరాలో కీలకమైన కృష్ణా ఫేజ్‌ -1 పంప్‌హౌజ్‌లో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 16, 17 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాలకు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ ఎం. దానకిశోర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కోదండాపూర్‌, నాసర్లపల్లి, గొడకండ్ల పంప్‌హౌజ్‌లో 600 ఎంఎం పైపులైన్‌పై వాల్వులు అమర్చడం, 300 ఎంఎం డయా పైపులైన్‌ లీకేజీలను అరికట్టేందుకు ఈ మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. 
 
ఈ నెల 16వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ కోరారు.
 
కాగా, నీటి సరఫరా నిలిపివేయనున్న ప్రాంతాలను పరిశీలిస్తే... మిరాలం, కిషన్‌బాగ్‌, బాల్‌షెట్టికేత్‌, అల్‌జుబేర్‌కాలనీ, అలియాబాద్‌, హషమాబాద్‌, రియాసత్‌నగర్‌, సంతోష్‌నగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, ఆస్మాన్‌ఘడ్‌, దిల్‌షుక్‌నగర్‌, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మెహబూబ్‌ మాన్షన్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, హిందీనగర్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివంరోడ్‌, చిలకలగూడ ప్రాంతాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments