Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాళ్లు జరజాగ్రత్త.. రూ.52లక్షలు మోసం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (12:39 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు పెచ్చరిల్లిపోతున్నారు. అమెరికా కంపెనీ పేరిట రూ.52లక్షలు మోసం చేశారు.. సైబర్ నేరగాళ్లు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన పోకర్ణ గ్రానైట్ అనే కంపెనీ, సౌత్ అమెరికా చెందిన కంపెనీతో ఆన్‌లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్నాయి. 
 
యూఎస్ కంపెనీ పేరుతో నకిలీ ఈ-మెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు… ఆర్డర్ చేసిన మెటీరియల్ పంపించామని.. అందుకు గాను 59వేల యూరోలు (52 లక్షల రూపాయలు) అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాలని హైదరాబాద్‌కి చెందిన కంపెనీకి ఈ-మెయిల్ చేశారు.
 
ఎప్పటిలాగానే వారు పంపిన ఈ-మెయిల్‌లో ఉన్న అకౌంట్‌లోకి 52 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు కంపెనీ ప్రతినిధులు. అనంతరం రోజులు గడుస్తున్నా మెటీరియల్ రాకపోడంతో అనుమానం వచ్చిన కంపెనీ ప్రతినిధులు.. నకిలీ ఈమెయిల్‌ను గుర్తించారు. 
 
మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెనీ ప్రతినిధి గౌతమ్ జైన్… ఆధారాలు కూడా ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments