Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాళ్లు జరజాగ్రత్త.. రూ.52లక్షలు మోసం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (12:39 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు పెచ్చరిల్లిపోతున్నారు. అమెరికా కంపెనీ పేరిట రూ.52లక్షలు మోసం చేశారు.. సైబర్ నేరగాళ్లు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన పోకర్ణ గ్రానైట్ అనే కంపెనీ, సౌత్ అమెరికా చెందిన కంపెనీతో ఆన్‌లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్నాయి. 
 
యూఎస్ కంపెనీ పేరుతో నకిలీ ఈ-మెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు… ఆర్డర్ చేసిన మెటీరియల్ పంపించామని.. అందుకు గాను 59వేల యూరోలు (52 లక్షల రూపాయలు) అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాలని హైదరాబాద్‌కి చెందిన కంపెనీకి ఈ-మెయిల్ చేశారు.
 
ఎప్పటిలాగానే వారు పంపిన ఈ-మెయిల్‌లో ఉన్న అకౌంట్‌లోకి 52 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు కంపెనీ ప్రతినిధులు. అనంతరం రోజులు గడుస్తున్నా మెటీరియల్ రాకపోడంతో అనుమానం వచ్చిన కంపెనీ ప్రతినిధులు.. నకిలీ ఈమెయిల్‌ను గుర్తించారు. 
 
మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెనీ ప్రతినిధి గౌతమ్ జైన్… ఆధారాలు కూడా ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments