Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన అమ్మాయిని ఎవరే.. రూ.2 లక్షలు స్వాహా చేసిన ఘనులు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (15:39 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సైబర్ ముఠా అందమైన అమ్మాయిని ఎరగావేసి రెండు లక్షల రూపాయల వరకు దోచుకుంది. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులను ఆశ్రయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెట్టుగూడకు చెందిన విక్రమ్‌ అనే యువకుడికి ఇటీవల ఓ విదేశీ ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తన పేరు పమేలా బిందే అని, యూకేలో స్థిరపడిన ఎన్నారై కుటుంబం అంటూ నమ్మించింది. నీకు అంగీకారమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ముగ్గులోకి దింపింది.
 
పైగా, పెళ్లి కూడా భారత్‌లోవనే చేసుకుందామని తెలిపింది. ఇందుకోసం ఖర్చులు, ఇతరత్రా కోసం రూ.కోట్లలో డబ్బు చెక్కు ద్వారా పంపిస్తానని నమ్మించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ చేసి యువకుడి నుంచి రెండు దఫాలుగా రెండు లక్షలకు పైగా డబ్బును తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. నగదు ట్రాన్సఫర్ అయిన తర్వాత సైబర్ కేటుగాళ్ళ ఫోన్లు స్విచ్చాఫ్‌ అయిపోయాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments