Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన అమ్మాయిని ఎవరే.. రూ.2 లక్షలు స్వాహా చేసిన ఘనులు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (15:39 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సైబర్ ముఠా అందమైన అమ్మాయిని ఎరగావేసి రెండు లక్షల రూపాయల వరకు దోచుకుంది. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులను ఆశ్రయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెట్టుగూడకు చెందిన విక్రమ్‌ అనే యువకుడికి ఇటీవల ఓ విదేశీ ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తన పేరు పమేలా బిందే అని, యూకేలో స్థిరపడిన ఎన్నారై కుటుంబం అంటూ నమ్మించింది. నీకు అంగీకారమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ముగ్గులోకి దింపింది.
 
పైగా, పెళ్లి కూడా భారత్‌లోవనే చేసుకుందామని తెలిపింది. ఇందుకోసం ఖర్చులు, ఇతరత్రా కోసం రూ.కోట్లలో డబ్బు చెక్కు ద్వారా పంపిస్తానని నమ్మించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ చేసి యువకుడి నుంచి రెండు దఫాలుగా రెండు లక్షలకు పైగా డబ్బును తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. నగదు ట్రాన్సఫర్ అయిన తర్వాత సైబర్ కేటుగాళ్ళ ఫోన్లు స్విచ్చాఫ్‌ అయిపోయాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments