Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని లొంగదీసుకున్నాడు... కూతురిపై అత్యాచారం... కామాంధుడి దారుణం...

ఒంటరిగా ఓ మహిళ వున్నదంటే కామాంధులు కాచుకుని కూర్చుని వుంటారు. ఏవో మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు సఫలమైతే ఇక ఆ తర్వాత వారి చేష్టలు మరింత వికృతరూపం దాల్చుతాయి

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (17:21 IST)
ఒంటరిగా ఓ మహిళ వున్నదంటే కామాంధులు కాచుకుని కూర్చుని వుంటారు. ఏవో మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు సఫలమైతే ఇక ఆ తర్వాత వారి చేష్టలు మరింత వికృతరూపం దాల్చుతాయి. హైదరాబాదు లోని నేరేడ్‌మెట్‌లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వివరాలు ఇలా వున్నాయి.
 
హైదరాబాద్ అడ్డగుట్టలో 35 ఏళ్ల వితంతువు కూలీ పని చేసుకుంటూ బతుకీడుస్తోంది. ఈమె సోదరి 11 సంవత్సరాల క్రితం మరణించడంతో ఆమెకు పుట్టిన పాపను ఈమే పెంచుతోంది. ఆమెకు 12 ఏళ్లు. ఆరవ తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఖలీల్ కళ్లు ఒంటరిగా వుంటున్న మహిళపై పడ్డాయి. ఆమెకు మాయ మాటలు చెప్పి, ఆసరాగా వుంటానని నమ్మించి ఆమెతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. 
 
ఐతే గత నెల రోజుల క్రితం బాలికపై కన్నేసిన ఖలీల్... ఆమెను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని గత నెలరోజులుగా ఆ బాలికపై చేస్తూనే వున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక పినతల్లి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments