Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలెర్ట్

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (09:26 IST)
తెలంగాణ హైదరాబాదులో 40డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుందని ఐఎండీ వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు అప్రమత్తంగా వుండాలని పిలుపు నిచ్చారు.
 
రాబోయే నాలుగు రోజుల పాటు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అయితే, సాయంత్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
అందుచేత అవసరం అయితేనే బయటకు రండి అంటూ ఐఎండీ హెచ్చరించింది. ఐఎండీ సూచనల ప్రకారం రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్‌ అంబేద్కర్ తెలిపారు. 
 
ఈ సమయంలో.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని.. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి వోఆర్‌ఎస్‌ , ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచించారు. ఇక, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments