Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఆరోపణలు చేయొద్దు : కోర్టు ఆదేశం

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (17:24 IST)
ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో తెరాస ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దీంతో ఆమెను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ బీజేపీ నేతల విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
వీటిని కవిత ఖండించినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆమె బీజేపీ నేతలపై రాష్ట్రంలోని 33 జిల్లా కోర్టుల్లో పరువు నష్టందావా వేశారు. అంతేకాకుండా తనపై ఆరోపణలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు... మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో ఇకపై కవితకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయరాదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మీడియాలోనే కాకుడా సోషల్ మీడియాలో కూడా కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments