Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచగొండి ఎస్ఐకు రెండేళ్ల జైలుశిక్ష.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (10:12 IST)
చట్టాలను పరిరక్షిస్తూ, ప్రజలను కాపాడాల్సిన పోలీసులు లంచగొండులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో ఓ లంచగొండి ఎస్ఐకు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని ప్రస్తుతం మాదాపూర్‌లో ఎస్ఐగా పని చేస్తూ వచ్చిన కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీసు స్టేషనులో విధులు నిర్వహించారు. గత 2013 జూన్ నెలలో స్వాధీనం చేసుకున్న ఇర్షాద్ ఖురేషీ వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు రాజేంద్ర రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఖురేషీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. మాటు వేసి రాజేంద్రకు ఖురేషీ రూ.10 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 
 
నిందితుడైన ఎస్ఐ రాజేంద్రను దోషిగా తేల్చి రెండేళ్ళ జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది. తీసుకున్న లంచంతో పాటు జరిమానాను తిరిగి చెల్లించకుంటే మరో మూడు నెలలు జైలు శిక్షను పొడగించాలని కోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments