Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం కష్టమొచ్చిందో... కన్నబిడ్డలను చూస్తూ.. సెల్ఫీ తీస్తూ మహిళ బలన్మవరణం

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (14:53 IST)
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ బలవన్మరణం చెందింది. ఆమెకు ఎలాంటి కష్టమొచ్చందో ఏమో తెలియదుగానీ, నవమాసాలు పెంచి కని పెంచిన కన్నబిడ్డలను చూస్తూ, సెల్ఫీ తీసుకుంటూ తనువుచాలించింది. తల్లిని కాపాడలేక ఆ చిన్నారులు పడిన వేదన అరణ్యరోదనే అయింది. అమ్మ ఇక లేదని తెలిసి ఆ బాలురిద్దరూ దీనంగా విలపిస్తుండడం చూపరుల హృదయాలను ద్రవించివేస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాలాపేటకు చెందిన మంజుల అనే మహిళకు 12 యేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. ఈమె భర్త లాలాపేట్ మెయిన్ రోడ్డులో బేకరీ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి రంజిత్, తేజస్ అనే ఇద్దరు కుమారులున్నారు. 
 
అయితే శనివారం నాడు మంజుల తన బిడ్డలు చూస్తుండగానే ఉరేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని రంజిత్, తేజస్ బేకరీలో ఉన్న తమ తండ్రికి ఫోన్ చేసి చెప్పారు.
 
కానీ భర్త వచ్చేసరికి మంజుల ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంజుల మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments