Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం కష్టమొచ్చిందో... కన్నబిడ్డలను చూస్తూ.. సెల్ఫీ తీస్తూ మహిళ బలన్మవరణం

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (14:53 IST)
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ బలవన్మరణం చెందింది. ఆమెకు ఎలాంటి కష్టమొచ్చందో ఏమో తెలియదుగానీ, నవమాసాలు పెంచి కని పెంచిన కన్నబిడ్డలను చూస్తూ, సెల్ఫీ తీసుకుంటూ తనువుచాలించింది. తల్లిని కాపాడలేక ఆ చిన్నారులు పడిన వేదన అరణ్యరోదనే అయింది. అమ్మ ఇక లేదని తెలిసి ఆ బాలురిద్దరూ దీనంగా విలపిస్తుండడం చూపరుల హృదయాలను ద్రవించివేస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాలాపేటకు చెందిన మంజుల అనే మహిళకు 12 యేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. ఈమె భర్త లాలాపేట్ మెయిన్ రోడ్డులో బేకరీ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి రంజిత్, తేజస్ అనే ఇద్దరు కుమారులున్నారు. 
 
అయితే శనివారం నాడు మంజుల తన బిడ్డలు చూస్తుండగానే ఉరేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని రంజిత్, తేజస్ బేకరీలో ఉన్న తమ తండ్రికి ఫోన్ చేసి చెప్పారు.
 
కానీ భర్త వచ్చేసరికి మంజుల ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంజుల మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments