Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలుడికి హెచ్.ఐ.వి.. బ్లడ్‌ బ్యాంకుపై కేసు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (13:11 IST)
హైదరాబాద్ నగరంలో తలసేమియా వ్యాధితో బాధపడుతూ వచ్చిన మూడేళ్ల బాలుడు హెచ్.ఐ.వి వైరస్ సోకింది. ఈ కేసులో రక్తదానం చేసిన బ్లండ్‌బ్యాంకు‌పై కేసు నమోదైంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లి అనే గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు గత ఏడు నెలలుగా తలసేమియాతో బాధపడుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాలుడికి రక్తమార్పిడి చికిత్స కోసం తండ్రి విద్యానగరులోని బ్లండ్ బ్యాంకు నిర్వాహకులను స్పందించారు. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ బాలుడికి రక్తమార్పడి చేస్తూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన రక్తమార్పిడి కోసం బాలుడిని తీసుకుని తల్లిదండ్రులు బ్లండ్ బ్యాంకుకు వచ్చారు. అక్కడ ఆ బాలుడికి నిర్వహించిన పారామెడికల్ పరీక్షల్లో హెచ్.ఐ.వి ఉన్నట్టు నిర్ధారణ అయిందని నల్లకుంట పోలీసులు వివరించారు. 
 
ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిపిన పరీక్షల్లో ఎపుడు కూడా హెచ్.ఐ.వి. పాజిటివ్‌గా రాలేదు. కానీ, తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా రావడంతో పోలీసులు బ్లడ్ బ్యాంకుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments