బండి సంజయ్‌కు హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌..

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (20:28 IST)
హుజూరాబాద్‌ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్దకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను భుజాలపైకి ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. 
 
బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. డప్పు వాయిద్యాలు మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బండి సంజయ్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వలనే హుజూరాబాద్‌లో భాజపా గెలుస్తోందని పేర్కొన్నారు. 
 
తెలంగాణలో ఎంతో ఉత్కంఠగా సాగుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా ఆరా తీశారు. బండి సంజయ్‎కి ఫోన్ చేసి ఫలితాలు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments