Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంట నగరాల్లో మందుబాబులకు షాక్ - 48 గంటలపాటు...

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. మొత్తం 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హోళీ వేడుకలను పురస్కరించుకుని పండుగ రోజున మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్లులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. 
 
అలాగే, హోళీ సంబరాల్లో భాగంగా అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీచేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టార్ హోటళ్లు, క్లబ్‌లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లు గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments