రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (20:52 IST)
కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహిస్తామని దక్షిణ మధ్య రైల్యే సీపీఆర్​వో రాకేశ్​ తెలిపారు. లోకో పైలెట్​ను రక్షించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయన్నారు.

కాచిగూడ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని రైల్వే సీపీఆర్​వో రాకేష్ తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని.. ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఎంఎంటీఎస్​ లోక్​ పైలెట్​ సిగ్నల్​ ఇవ్వకుండా ఎందుకు రైలును ముందుకు తీసుకున్నాడో దర్యాప్తులో తేలుతుందన్నారు. లోకో పైలట్​ చంద్రశేఖర్​తోపాటు మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సీపీఆర్​వో తెలిపారు.

బాధితుల వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్-040-27700868, కాచిగూడలో 040-27568624 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.

ప్రమాదం వల్ల సికింద్రాబాద్​- ఫలక్​నుమా, కాచిగూడ-ఫలక్​నుమాకు వెళ్లాల్సిన ఎంఎంటీఎస్​ రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్లు వెల్లడించారు. వీటితోపాటు ఫలక్​నుమా- జనగాం, సికింద్రాబాద్ -కర్నూల్​ సిటీ, ఫలక్​నుమా-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి రైళ్లను రద్దు చేశామని వివరించారు.

కాచిగూడ-గుంటూరు, ఫలక్​నుమా -ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments