Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలు.. హై అలర్ట్‌ను ప్రకటించిన జీహెచ్ఎంసీ

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:44 IST)
భారీ వర్షాల నేపథ్యంలో హై అలర్ట్‌ను జీహెచ్ఎంసీ ప్రకటించింది. మరో గంట పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.

ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. అనవసరంగా బయటకు రావొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ సూచించింది. సమస్యల ఫిర్యాదులకు జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ 040-21111111 ఏర్పాటు చేసింది.
 
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్‌లో వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, మెహదీపట్నం, టోలీచౌకి, మాసబ్‌ట్యాంక్, నాంపల్లిలో భారీ వర్షం పడింది. వరద నీరు రోడ్డు పైకి వచ్చింది.

దీంతో హైటెక్‌ సిటీ నుంచి కేపీహెచ్‌బీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments