Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్‌ జిల్లాలో వింత వ్యాధి: భారీగా నాటుకోళ్లు మృత్యువాత

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:07 IST)
కరీంనగర్‌ జిల్లాలో వింత వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో భారీగా నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కళేబరాలను గ్రామశివారులో పూడ్చి పెట్టాడు యజమాని. కోళ్ల మృతితో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కోళ్ల మృతికి గల కారణాలను అన్వేషించాలని కోరాడు. 
 
అయితే.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. బర్డ్‌ ఫ్లూ అంటూ భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు చనిపోయిన కోళ్లను పరిశీలించిన పశు వైద్యాధికారులు.. బర్డ్‌ ఫ్లూ కాదని చెబుతున్నారు.
 
వికారాబాద్‌ జిల్లాలోనూ ఇదే ఘటన వెలుగుచూసింది. దారూర్‌ మండలం దోర్నాల్‌లో గత 4 రోజులుగా వందల సంఖ్యలో కోళ్లు, కాకులు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లు, కాకుల మృతిపై పశుసంవర్ధకశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments