Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు : స్తంభించిన జనజీవనం!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (11:03 IST)
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయింది. సోమవాం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడం రోడ్లపై నీరు చేరింది. మురుగు కాలువలు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలో సోమవారం 58.9 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని, అత్యధికంగా చింతూరు మండలంలో 153 మిమి వర్షపాతం నమోదైందని జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి తెలిపారు. 
 
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సోమవారం జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు రోజువారి పనులను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇదిలావుండగా ఈ వర్షం ప్రభావం సింగరేణిపై కూడా పడింది. ఈ వర్షాల కారణంగా వరద నీరు గనులలోకి వచ్చి చేరడంతో దాదాపు 21 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా దాదాపు రూ.కోటి నష్టం వాటిల్లిందన్నారు. 
 
మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేయడం జరిగిందని, దీని ద్వారా 15,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేయడం జరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం 38.9 అడుగుల మేర ప్రవహిస్తుండగా సోమవారం సాయంత్రానికి అది 25 ఫీట్లకు చేరుకుంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments