హైదరాబాద్‌లో 3.75 కోట్ల నగదు స్వాధీనం...

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (08:34 IST)
హైదరాబాద్ నగరంలో 3.75 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా హవాలా మనీగా గుర్తించారు. భాగ్యనగరంలో జరుగుతున్న హవాలా రాకెట్‌కు సంబంధించిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వీరంతా హవాలా మార్గాల్లో నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా రూ.3.75 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ నలుగురు వ్యక్తులు ముంబైకి చెందిన ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తేలింది. ఆ సంస్థ యజమాని అహ్మదాబాద్‌కు చెందినవాడిగా తెలిసింది. 
 
హైదరాబాదులో బ్రాంచి ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. కాగా స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments